సినిమా, టీవీ రంగాల్లో ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉంటే మాత్రమే అవకాశాలు వస్తాయి.ఈ రంగాల్లో ప్రతిభకు సమానంగా అదృష్టానికి పట్టం కడతారు.
వరుసగా రెండు మూడు హిట్లు వస్తే గోల్డెన్ లెగ్ అని రెండు మూడు ఫ్లాపులు వస్తే ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారు.ఎంతో ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు రాక కనుమరుగైపోయిన వాళ్లు సినిమా, టీవీ రంగాల్లో చాలా మందే ఉన్నారు.
యాంకర్ భాను శ్రీ కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.టీవీ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన భాను శ్రీ పలు గేమ్ షోలను కూడా హోస్ట్ చేసింది.
బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా భాను శ్రీకి మంచి గుర్తింపు వచ్చింది.సినిమా అవకాశాలు కూడా రావడంతో కుమారి 21 ఎఫ్, కాటమరాయుడు, బాహుబలి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
కొన్ని వారాల క్రితం ఈమె జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే అదిరింది షోకు యాంకర్ గా ఎంపికైంది.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా అనసూయ, రష్మీలకు ఏ విధమైన గుర్తింపు దక్కిందో అదిరింది షో ద్వారా తనకు కూడా అలాంటి గుర్తింపే దక్కుతుందని భాను శ్రీ భావించింది.
భాను శ్రీ తో రవి యాంకర్లుగా వ్యవహరించి కొన్ని ఎపిసోడ్లను బాగానే నెట్టుకొచ్చారు.అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అదిరిందిని బొమ్మ అదిరిందిగా మార్చిన నిర్వాహకులు రవి, భాను శ్రీ స్థానంలో శ్రీముఖిని తీసుకొచ్చారు.దీంతో కొందరు భాను శ్రీ ఫ్యాన్స్ భాను శ్రీని షోలోకి తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.భాను శ్రీ కూడా సోషల్ మీడియాలో ఆ పోస్టులను షేర్ చేస్తోంది.
దీంతో ఆమె పరోక్షంగా తనను మళ్లీ అదిరింది షోకు తీసుకోవాలని కోరుతోంది.భాను శ్రీ అలా ఫ్యాన్స్ పోస్టులు షేర్ చేస్తూ ఉండటంతో కొందరు నెటిజన్లు “భాను శ్రీకి చాలా ఆశలు ఉన్నాయ్ అబ్బా” అని కామెంట్లు పెడుతున్నారు.
మరి బొమ్మ అదిరింది నిర్వాహకులు భాను శ్రీ కోరికను మన్నిస్తారో లేదో చూడాల్సి ఉంది.