జబర్దస్త్ షో కు గుడ్ బై పలికిన స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో పెద్ద ఛానల్ లో ప్రోగ్రామ్ కు సిద్దమైన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తన కొత్త షో వచ్చేస్తుంది అని ఈమె ట్విట్టర్ ద్వారా తెలిపింది.
శనివారం నుంచి రాత్రి 9 గంటలకు జీ టీవీ తెలుగులో తన కొత్త షో వస్తుంది అని లోకల్ గ్యాంగ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టి మరి ట్వీట్ చేసింది ఈ అమ్మడు.జబర్దస్త్ కార్యక్రమంతో తన కెరియర్కు బాట వేసుకున్న అనసూయ ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చాయి కూడా.అయితే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధమౌతోంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఆ వార్తలు నిజమే అంటూ అనసూయ ట్వీట్ చేసి తన కొత్త షో గురించి చెప్పడం తో ఇప్పుడు ఆ విషయం తేటతెల్లమైంది.గతంలో కూడా జబర్దస్త్ చేసిన అనసూయ కొద్దీ రోజులు ఆ షో కు దూరంగా ఉంది.
ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ ను యాంకర్ గా తీసుకువచ్చి అనసూయ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించారు.
అయితే ఏమైందో ఏమోగానీ కొద్దీ రోజుల తరువాత అనసూయ తిరిగి అదే షో కి రావడం తో ఇద్దరు యాంకర్స్ తో రెండు జబర్దస్త్ షో లను నిర్వహించారు నిర్వాహకులు.అయితే ఇప్పుడు మళ్లీ అనసూయ ఈ షో కు గుడ్ బై పలకడం తో ఇప్పుడు ఆమె స్థానంలో మరో యాంకర్ శ్రీముఖి ని తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు.అనసూయ తో పాటు ఈ షో కు జబర్దస్త్ జడ్జ్ నాగబాబు అలానే పలు జబర్దస్త్ టీంలు కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తుంది.