అనసూయను మరోసారి ఆడుకుంటున్న నెటిజన్లు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ తో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు మిడిల్ క్లాస్ ఫౌండేషన్ ద్వారా వారికి సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.అయితే విజయ్ దేవరకొండ చేస్తున్న మంచి పనికి కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు వార్తలను జోడించి ప్రచురించడంతో విజయ్ చాలా హర్ట్ అయ్యాడు.

 Anasuya, Vijay Devarakonda, Killfakenews, Social Media-TeluguStop.com

వెంటనే సదరు వెబ్‌సైట్ల తీరుపై ఆయన మండిపడ్డాడు.

కాగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించే వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలంటూ విజయ్ పిలుపునిచ్చాడు.

అయితే విజయ్‌పై వచ్చిన ఆరోపణలను పలువురు సినీ ప్రముఖులు ఖండించి విజయ్‌కు అండగా నిలిచి తమ మద్దతును ప్రకటించారు.అయితే టాలీవుడ్ యాంకర్ అనసూయ ఈ సమయంలో చేసిన ఓ కామెంట్ ఆమెకు తలనొప్పిని తెచ్చి పెట్టింది.

మనవరకు వస్తేగాని బుద్ధి రాదన్నమాట అంటూ ఘాటుగా కామెంట్ చేయడంతో అనసూయపై నెటిజన్లు మండి పడుతున్నారు.విజయ్ దేవరకొండ ప్రజల కోసం సాయం చేస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్ చేయడం సరికాదని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అయితే ఇక్కడ అనసూయ చాలా తెలివిగా వ్యవహరించింది.ఎవ్వరినీ ట్యాగ్ చేయకుండా కేవలం కామెంట్ చేయడంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిందో అర్ధం కావడం లేదని, ఇలాంటి సమయంలో జోక్స్ వేయడం ఏం బాలేదని అనసూయ ఫ్యాన్స్ కూడా అంటున్నారు.

ఏదేమైనా అనసూయ చేసిన కామెంట్ ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టిందని చెప్పాలి.మరి అనసూయ చేసిన ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించిందో తెలియాలంటే మాత్రం ఆమె నోరువిప్పాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube