జబర్దస్త్ షో ద్వారా, సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అనసూయ.ఏ విషయం గురించైనా కుండ బద్దలుగొట్టినట్టు స్ట్రెయిట్ గా చెప్పే అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు గతేడాది నాలుగు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చి చేజారిపోయానని.
కావాలనే తనను తప్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
గతేడాది సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం గురించి చర్చ జరగగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెటిజం ఉందని అనసూయ కామెంట్లు చేశారు.
షూటింగ్ పూర్తైన తరువాత చేసే నెట్వర్కింగ్ ఈ ఫేవరెటిజానికి కారణమని ఆమె అన్నారు.తాను ఫేవరెటిజం వల్ల అవకాశాలను పోగొట్టుకున్నానని అనసూయ చెప్పారు.బయటకు, కంటికి కనిపించి ఫేవరెటిజం సినిమా ఇండస్ట్రీలో ఉందని అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటిస్తామని అయితే సినిమా విడుదలయ్యేంత వరకు తమ పాత్ర సినిమాలో ఉంటుందో లేదో అనే టెన్షన్ ఉంటుందని అనసూయ అన్నారు.నాలుగు పెద్ద సినిమాల్లో తనను తప్పించారని.తనకు బదులుగా ప్రస్తుతం ఆ సినిమాల్లో నటిస్తున్న వాళ్లు తనకంటే బాగా నటించే వాళ్లు అయితే కాదని ఆమె తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయంటూ ఆమె చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుందని.
కామెంట్ల గురించి స్పందించి సమయాన్ని వృథా చేసుకోవాలని తాను అనుకోవడం లేదని.అందువల్లే నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించడం తాను పూర్తిగా మానేశానని తెలిపారు.
అనసూయ తనను నాలుగు సినిమాల నుంచి తప్పించారని చెప్పడంతో ఆ సినిమాల గురించి, ఆమెను సినిమాల నుంచి తప్పించిన దర్శకనిర్మాతల గురించి నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.