యాంకర్ అనసూయ ఎవరో తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.యాంకర్ గా ఇన్నేళ్లు బుల్లితెర మీద సత్తా చాటడమంటే మాటలు కాదు.
యాంకర్ సుమ తరువాత ఆ స్థానాన్ని అనసూయ దక్కించుకుంది.తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కిస్తున్న అనసూయ ఇటు నటిగానూ తన సత్తాను నిరూపించుకుంటోంది.
అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.అంతేకాక రకరకాల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది, లైవ్ లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ చాట్ చేసిన అనసూయ తన అందానికి గల కారణమేంటో తెలియజేసింది.ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రతి రోజు సాయంత్రం 7:30 కంటే ముందు భోజనం పూర్తి చేసి ఓ అరగంట పాటు ఏదో ఒక పని చేస్తూ ఉండాలని, గోరు వెచ్చని నీరు త్రాగడం, తప్పకుండా రోజూ ప్రాణాయామం చేయాలని, యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి, ఆ ప్రశాంతత మన ముఖంలో కనిపిస్తుందని అనసూయ తెలిపింది.మనం ఏ పని చేస్తున్నా ఆ పని ఎందుకు చేస్తున్నామో ఒక క్లారిటీతో ఉండాలని,అప్పుడు టెన్షన్ కు గురి కాకుండా పనులు సాఫీగా పూర్తవుతాయని, మనం అందంగా కనిపించడానికి ఇటువంటివన్నీ దోహదపడతాయని అనసూయ తెలిపింది.