ప్రస్తుతం కొందరు సైబర్ నేరగాళ్లు కొంతమంది ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు అసభ్యకరంగా చిత్రీకరించి నెట్ లో వైరల్ చేస్తున్నారు.తాజాగా ఈ మార్ఫింగ్ సమస్య జబర్దస్త్ షో యాంకర్ అందాల భామ అనసూయను కూడా వెంటాడుతోంది.
ఈ రోజున ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ చీరలో దిగినటువంటి అనసూయ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు.అయితే కొందరు తెలియని వ్యక్తులు ఈ ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని అసభ్యకరంగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంపై యాంకర్ అనసూయ స్పందించింది.ఇందులో భాగంగా తన ఫోటో షూట్ సమయంలో దిగినటువంటి ఒరిజినల్ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫోటోని ఎవరో మార్ఫింగ్ చేశారని దయచేసి మీరుఈ మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఎక్కడైనా చూసినట్లయితే తనకు వెంటనే సమాచారం అందించాలని తన అభిమానులను కోరారు.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ టీవీ చానల్ తో సంబంధం లేకుండా తెలుగులోని దాదాపు అన్ని ప్రముఖ ఛానళ్లలో షోలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.మరోపక్క మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ఇటువంటి చిత్రాల్లో కూడా నటించేందుకు అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు.