ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఒకవేళ ఈ అవకాశం లేనటువంటి కొన్ని సంస్థలు ఏకంగా మూసివేశారు కూడా.అయితే ఈ సెలవులు ప్రకటించిన రంగాల్లో సినీరంగం ఒకటి.
అయితే ఈ కరోనా వైరస్ వల్ల సినీరంగానికి కొంత కాలంపాటు సెలవులు ప్రకటించడంతో ఈ రంగంలో పని చేస్తున్నటువంటి కొందరు తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు.
అయితే ఓ పక్క షోలు, మరో పక్క సినిమాలు అంటూ ఎప్పుడు బిజీబిజీగా గడిపేటువంటి యాంకర్ అనసూయ కరోనా వైరస్ పై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ వైరస్ గురించి అందరూ భయపడుతుంటే యాంకర్ అనసూయ మాత్రం కరోనా వైరస్ తనకు మేలు చేసిందని అంటోంది.అయితే ఇందుకు వివరణ ఇస్తూ ఈ కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం పలు ఈవెంట్లకు, షోలకు సెలవులు ఇచ్చారని దీంతో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే తాను తన కుటుంబం కోసం సమయం కేటాయిస్తూ భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు.
అంతేగాక తనకు ఎంతో ఇష్టమైనటువంటి అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని కూడా చూసినట్లు ట్విట్టర్లో పేర్కొంది అనసూయ.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి ఓ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.అంతేగాక యాంకర్ అనసూయ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ల చిత్రాల్లో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.
దీంతో గత కొద్ది కాలంగా ఈ అమ్మడు బిజీ షెడ్యూల్ తో బిజీబిజీగా గడుపుతోంది.