ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో పాతాళ లోక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.విరాట్ కోహ్లి భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా సాగుతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా విరాట్ కోహ్లి కూడా తన భార్య చేసిన వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించాడు.
అద్భుతమైన కథ, కథనంతో తెరకెక్కించారని కితాబు ఇచ్చారు.ఇక బాలీవుడ్ ప్రముఖులు ఈ వెబ్ సిరీస్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇప్పటి వరకు హిందీలో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇదే బెస్ట్ అని అంటున్నారు.
దానికి తగ్గట్లే అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా వెబ్ సిరీస్ పై తెలుగు స్టార్ యాంకర్, నటి అనసూయ ఈ సిరీస్ పై తెలుగు యాంకర్ అనసూయ ప్రశంసలు కురిపించింది.పాతాళ్ లోక్ అద్బుతమైన సిరీస్ అని ఇప్పటి వరకు తాను చూసిన వాటిలో ఇదే తన ఫేవరెట్ అని తెలిపింది.
నటీనటుల నటన, మేకింగ్ అన్నీ అదిరిపోయాయని అనసూయ ప్రశంసించింది.సిరీస్ పూర్తయిన విధానం కూడా తనకు చాలా నచ్చిందని తెలిపింది.ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ అని తాను అనుకుంటున్నానని చెప్పింది.