సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ మొదలైంది.ఒకరిపై ఒకరు మాటలతో, మీమ్స్ తో దాడి చేసుకొని ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ఎవరైనా తమ అభిమాన హీరోలని క్యాజువల్ గా అయిన ఒక్క మాట అంటే వెంటనే దాడి చేస్తారు.బూతులు, అశ్లీల కామెంట్స్ తో రెచ్చిపోతారు.
వారిని కించ పరుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తారు.ఈ సోషల్ మీడియా ప్రభావం మంచికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కాని అభిమానుల కారణంగా హీరోల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.
అలాగే ఫ్యాన్స్ ట్రోల్స్ కారణంగా హీరోల మీద కామెంట్స్ చేసిన వారు మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి.ఫ్యాన్స్ కారణంగానే హీరోలకి ఏ మాత్రం సంబంధం లేకుండా శత్రువులు తయారవుతున్నారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కారణంగా టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న హీరో అంటే పవన్ కళ్యాణ్ పేరు ముందు వరుసలో వినిపిస్తుంది.రాజకీయాలలో కూడా ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా, ఏదైనా కామెంట్స్ చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొందరు బూతు పదజాలంతో ఇష్టానుసారంగా వారిపై ఎదురుదాడి చేస్తారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ కారణంగా అసహనానికి గురైంది.తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వలన తాను మానసికంగా ఎంత ఆవేదనకి గురయ్యానో అనే విషయాన్ని ఓ టీవీ షోలో చెప్పుకొచ్చింది.
అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ కోసం తనని సంప్రదించగా అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండటంతో చేయలేకపోయా, తరువాత ఓ సందర్భంలో పార్టీ సాంగ్ లో చేయకుండా మంచి పని చేశా అని కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది సోషల్ మీడియాలో తనని ఇష్టానుసారంగా ట్రోల్ చేశారు.వారిలో కొంత మంది పెట్టె కామెంట్స్ తనని మానసికంగా బాధించాయి అనే విషయాన్ని చెప్పింది.మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణంగా ఇలా చాలా మంది సెలబ్రిటీలు బయటకి చెప్పుకోలేని ఆవేదనకి గురవుతున్నారని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.ఇప్పటికైనా ఇలాంటి ట్రోల్స్ తగ్గించుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేయకుండా ఉంటే బెటర్.