టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందమైన యాంకర్ అనసూయ.ఈమె సినిమాలు చానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా తెలుగులో ఉన్నటువంటి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో యాంకరింగ్ పరంగా తన హవా ని కొనసాగిస్తోంది.
అంతేకాక ఈ అమ్మడు ఒకపక్క షోలు, ఈవెంట్లు చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ, పలు ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది.దీంతో ప్రస్తుతం యాంకర్ అనసూయ రెండు చేతులా సంపాదిస్తోంది.
అయితే తాజాగా యాంకర్ అనసూయ ఓ ప్రముఖ ఫోటోషూట్ ఈ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా కొత్త తరం ప్యాషన్ తో చీరకట్టులో అందమైన ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే తాజాగా అనసూయ ప్రేమకు సంబంధించిన ఓ కవితని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
అయితే ఇంతకీ ఆ కవిత ఏంటంటే “నన్ను ప్రేమించిన, ద్వేషించినా, లేదా నాకు ధర కట్టినా పోయేది ఏమీ ఉండదని దాని అర్థం.ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు అని అంటోంది”.
అయితే ప్రస్తుతం ఈ ప్రేమ కొటేషన్ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.అంతేగాక నెటిజన్లు ఇంత ప్రేమగా ఎవరి కోసం కొటేషన్స్ షేర్ చేసావంటూ యాంకర్ అనసూయపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.అలాగే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అటువంటి చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.