తెలుగు బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అయితే మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర పై నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.కాగా మొన్నటి వరకు జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వెండితెరపై సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక జబర్దస్త్ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.అనసూయ నటించిన రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలో ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటించే అనసూయ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో అనసూయ బ్లాక్ కలర్ టాప్ ధరించి మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది.అంతేకాకుండా ఆ ఫోటోలను చూస్తుంటే అనసూయ కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అంతా అందంగా రెడీ అయ్యి ఆ ఫోటోలతో యువతని ఆకర్షిస్తుంది.ప్రస్తుతం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే అనసూయ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాతో పాటుగా రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబ లాంటి సినిమాలలో నటిస్తోంది.