నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ.భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బోయపాటి గత చిత్రాల శైలిలోనే ఈ మూవీ కూడా తెరకెక్కుతుంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
అలాగే బాలీవుడ్ నటుడు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.అలాగే ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పూర్ణ మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించనుంది.
ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో మరోసారి కనిపించబోతున్న సంగతి తెలిసిందే.బోయపాటి గతంలో ఈ మూవీలో రైతు పాత్రలో బాలకృష్ణని ఎలివేట్ చేయగా రీసెంట్ గా అఘోర పాత్రతో రౌద్రరాసాన్ని టీజర్ లో ప్రెజెంట్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనేది హిట్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది.ఈ మూవీలో హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించాబోతుందని తెలుస్తుంది.
ఇక సినిమాలో ఆమె పాత్ర నిడివి ఓ 20 నిమిషాల పాటు ఉంటుందని వినికిడి.అలాగే సినిమాలో ఆమె ప్రాత్ర చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
అయితే అనసూయ నటించే విషయంపై బోయపాటి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.