బుల్లితెర యాంకర్ అనసూయ ఒకవైపు జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అనసూయ గర్భిణిగా నటిస్తున్న థ్యాంక్యూ బ్రదర్ సినిమా ట్రైలర్ నిన్న విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యాంకర్ అనసూయ మాట్లాడుతూ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన మనస్సుకు ఈ సినిమా ఎంతో దగ్గరైందని.లాక్ డౌన్ సమయంలో థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథను తాను ఫోన్ లో విన్నానని.ఈ సినిమా కథ తనకు కొత్తగా అనిపించిందని తెలిపారు.తాను కొత్తదనానికి త్వరగా అడిక్ట్ అవుతానని అందువల్ల తాను కూడాఈ కథలో భాగం కావాలని కోరుకున్నానని తెలిపారు.
సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తైందని అనసూయ అన్నారు.కథ విన్న సమయంలో లిఫ్ట్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ కథను ఎలా తెరకెక్కిస్తారో తనకు కూడా అర్థం కాలేదని కానీ సినిమాను బాగా తీశారని అన్నారు.
అందరూ ఒక కుటుంబంలా మారి సినిమాను ఇష్టంతో, తపనతో తీశామని అనసూయ తెలిపారు.ఈ సినిమాను తన తొలి సినిమాలా భావించి నటించానని.థ్యాంక్యూ బ్రదర్ అభినయానికి ఆస్కారం ఉన్న సినిమా అని తెలిపారు.విరాట్ అశ్విన్ అమేజింగ్ యాక్టర్ అని.అతనితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అనసూయ అన్నారు.
విరాట్ అశ్విన్ పాత్రకు తనకంటే ఎక్కువగా ప్రెజర్ ఉంటుందని.ఊహించిన దాని కంటే అతను గొప్పగా చేశాడని తెలిపారు.మొదట్లో కొత్తవాళ్లతో సినిమా అంటే కంగారు పడ్డానని తెలిపారు.
విరాజ్ అశ్విన్ సినిమా గురించి మాట్లాడుతూ అనసూయ గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారని.మంచి స్కోప్ ఉన్న పాత్ర తనకు దక్కిందని తెలిపారు.
కరోనా సమయంలోనూ టీమ్ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చిందని విరాజ్ అశ్విన్ తెలిపారు.