న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత జబర్దస్త్ షో తో హాట్ యాంకర్ అవతారం ఎత్తిన అందాల భామ అనసూయ.ఈ అమ్మడు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత యాంకర్ గా తెరంగేట్రం చేసి ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చింది.
రొటీన్ పంథాలో సాగిపోతున్న టెలివిజన్ యాంకరింగ్ కి అనసూయ ఏకంగా గ్లామర్ ని తీసుకొచ్చింది.ట్రెండ్ కి కనెక్ట్ అవ్వాలంటే గ్లామర్ షో తప్పనిసరి అని ఫిక్స్ అయ్యి ఆ దిశగా తనని మేకోవర్ చేసుకొని ఒక్కసారిగా స్టార్ యాంకర్ అయిపొయింది.
వరుసగా షోలు చేసే అవకాశం సొంతం చేసుకుంది.ఇదే సమయంలో నటిగా కూడా తెరంగేట్రం చేసి సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు ఫుల్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సక్సెస్ వెనుక ఆమె కష్టం ఎంత ఉందో భర్త సపోర్ట్ కూడా అంతే ఉంది.
ఈ నేపధ్యంలోనే కుటుంబానికి కూడా అనసూయ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ ఆసక్తికర వాఖ్యలు చేసింది.తన బయోపిక్ లో ప్రేక్షకులకి కావాల్సినంత మసాలా, ట్విస్ట్ లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ దొరుకుతాయని చెప్పుకొచ్చింది.ఒక సంప్రదాయమైన ట్రెడిషనల్ కుటుంబంలో తన ప్రయాణం, తరువాత తన ప్రేమ, కుటుంబానికి ఇష్టం లేకుండా పెళ్లి, పిల్లల పెంపకం, యాంకరింగ్ కెరియర్, నటిగా ప్రయాణం ఇలా అన్ని అంశాలు తన బయోపిక్ లో ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పింది.
డబ్బు భాగా సంపాదించిన తర్వాత అవకాశం ఉంటే తన బయోపిక్ తానే తెరకెక్కిస్తానని కూడా అనసూయ చెప్పడం విశేషం.