ఏదో ఓ పోస్ట్ చేసి ఆపై హాయిగా బిర్యాని తినడం లేదా? నెటిజన్స్ పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ.!

జమ్ము, కశ్మీర్‌లోని భారత జవాన్లపై పుల్వామా ఉగ్రదాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకొన్నాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై మిరాజ్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులకి పాల్పడింది.

 Anchor Anasuya Fires On Netizens Due To Post Of Pulwama Attack-TeluguStop.com

ఈ దాడిలో సుమారు మూడు వందల మంది టెర్రరిస్ట్ లు మరణించినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది.ఈ ఘటన పై సెలెబ్రిటీలు ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేసారు.

ట్విట్టర్ లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే యాంకర్ రష్మీ కూడా తన స్టైల్ లో ట్వీట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ విషయంపై అనసూయ కూడా ట్వీట్ చేసారు.

అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.అయితే దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ‘ఇక ఎందుకు ఆలస్యం.

పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని యాంకరింగ్ చేసుకో.పో’అని కామెంట్ చేసారు.

దీనిపై యాంకర్ అనసూయ ఘాటుగా స్పందిస్తూ…”నేను ఒక పోస్ట్ పెట్టాను.మీరు వీలయితే నివాళి అర్పిస్తూ ఓ పోస్ట్ చేయండి.ఎందుకు ప్రతిసారీ నా దుస్తుల గురించి ప్రస్తావిస్తారు.అంతెందుకు మీరు కూడా ఏదో ఓ పోస్ట్ చేసి ఆపై హాయిగా బిర్యాని తినడం లేదా? ఇంకా నిజంగా మీకు దేశభక్తి ఉంటే కాశ్మిర్ వెళ్లి మనదేశం తరపున యుద్ధం చేయండి” అంటూ వీడియో పోస్ట్ పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube