ప్రస్తుతం రాష్ట్రంలో కారణం వైరస్ ప్రబలుతున్నడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్లోని ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్ మరియు కార్యక్రమాలు కూడా వాయిదా వేశారు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు డబ్బులు మరియు నెలకి అవసరమైనటువంటి బియ్యం అందిస్తామని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ విషయంపై టాలీవుడ్ లో అందమైన యాంకర్ అనసూయ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ షూటింగ్లు ఆగిపోయిన కారణంగా తమ పనులు లేవని, ఒకవేళ మేము పని చేయకపోతే మాకు డబ్బులు రావని, మేము కూడా ఇంటి అద్దెలు, నెలసరి వాయిదాలు వంటి వివరించాలని కాబట్టి తమకు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
అయితే ఈ విషయాన్ని నెటిజన్లను బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక ఖరీదైన కార్లలో తిరుగుతూ, హైదరాబాదు నగరంలోని దాదాపుగా ఖరీదైన ప్రాంతంలో ఉంటూ మీలాంటి వాళ్ళు ఇలా అడ్డుకోవడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇలాంటి కామెంట్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
దీంతో యాంకర్ అనసూయ పోలీసుల్ని ఆశ్రయించింది.ఇందులో భాగంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సార్ మేము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్నామని అందువల్లనే తమ గురించి కూడా ఒకసారి ఆలోచించండని తెలియజేశామని అందుకే ఇలా సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని అంతేగాక అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని కాబట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేసింది.