స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రష్మిక మందన్నా హీరోయిన్ గా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తైన ఈ సినిమాలోని ఒక ముఖ్య పాత్రకు సుకుమార్ స్టార్ యాంకర్ అనసూయను సంప్రదించారని అయితే అనసూయ మాత్రం ఆ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదని సమాచారం.
దీంతో బన్నీ సినిమాకు అనసూయ నో చెప్పిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అనసూయ తెలుగులో చాలా సినిమాల్లో నటించినా రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది.
ప్రేక్షకుల్లో కొంతమంది అనసూయను ఒరిజినల్ నేమ్ కంటే రంగమ్మత్త అనే పేరుతోనే పిలుస్తారంటే ఆ నేమ్ ఎంత పాపులర్ అనే విషయం అర్థమవుతుంది.అయితే రంగమ్మత్త లాంటి పాత్ర ఇచ్చి అనసూయకు మంచి పేరు వచ్చేలా చేసిన సుకుమార్ సినిమాకు అనసూయ నో చెప్పడం ఇండస్ట్రీ వర్గాలను అవాక్కయ్యేలా చేస్తోంది.
అయితే అనసూయ నో చెప్పడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని సమాచారం.పుష్ప సినిమాలో అనసూయకు సుకుమార్ ఆఫర్ చేసిన రోల్ బాగానే ఉన్నా ఆ పాత్రలో అనసూయ డీ గ్లామరస్ గా కనిపించాల్సి ఉంది.టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో బిజీ అవుతున్న తరుణంలో డీ గ్లామరస్ రోల్స్ రిస్క్ అని భావించి అనసూయ సుకుమార్ ఆఫర్ చేసిన పాత్రను సున్నితంగా తిరస్కరించారని సమాచారం.
అయితే సుకుమార్ లేదా అనసూయ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.
పాత్ర ఎంపికలో ఎంతో కేర్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ, కిలాడీ సినిమాలతో పాటు కోలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.