బుల్లితెరపై హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తునే వెండితెరపై అద్భుతమైన అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో కీలక పాత్రలో నటించడమే కాకుండా ఐటంసాంగ్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇప్పటికే రెండు మూడు సినిమాలలో ప్రత్యేక గీతాల్లో నటించిన అనసూయ ఐటెం సాంగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కనుండగా ఈ చిత్రంలో ప్రత్యేక పాటలో అనసూయ చిందులు వేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఇప్పటికే చిత్రబృందం సినిమాలోని ప్రత్యేక పాటలో నటించడం కోసం ఏమైనా సంప్రదించగా అందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలోని ప్రత్యేక పాటలో నటించడం కోసం అనసూయ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.ఇకపోతే అనసూయ ప్రస్తుతం ఆచార్య, పుష్ప, ఖిలాడీతో పాటు రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న యాంకరమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.