సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ రెగ్యులర్ గా వివాదాలను మూట కట్టుకుంటూనే ఉంటుంది.ఈ అమ్మడు రెగ్యులర్ గా ఏదో ఒక విషయమై నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడిని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న చర్చనీయాంశంగా ఉంది.విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా లో ఉన్న మాదర్ చూద్ డైలాగ్ ను అనసూయ వ్యతిరేకించింది.
ట్రైలర్ లో ఆ పదంను వాడటం పట్ల అనసూయ చాలా ఫైర్ అయ్యింది.ఇలాంటి బూతులను ఎలా వాడుతారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఆ సమయంలో కొందరు విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ అనసూయపై కామెంట్స్ చేశారు.కాని ఇప్పుడు అనసూయ ను సమయం సందర్బం వచ్చిన ప్రతి సారి కూడా ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు మరోసారి ఆ పదం వల్ల టార్గెట్ అయ్యింది.
ఇటీవల నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ వచ్చింది.
ఆ ట్రైలర్ చివర్లో నాగార్జున చాలా ఆవేశంతో పాకిస్తానీ ఉగ్రవాదిని మాదర్ చోద్ అంటూ తిట్టాడు.ఆ పదం ప్రస్తుతం వైరల్ అవుతోంది.అప్పుడు విజయ్ దేవరకొండ మూవీ పై విమర్శలు చేసిన అనసూయ ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అంటూ కొందరు ఆమెను ప్రశ్నించారు.తాజాగా ఫొటో షూట్ ను అనసూయ షేర్ చేసింది.
ఆ ఫొటోలకు ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ ఇప్పుడు సందర్బం కాకపోవచ్చు.కాని గతంలో అర్జున్ రెడ్డి విషయంలో అంత రచ్చ చేసిన మీరు ఇప్పుడు మాత్రం వైల్డ్ డాగ్ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు.
దానికి మరి కొందరు సమాధానం చెబుతూ అప్పుడు విజయ్ కొత్త హీరో కనుక ఏం అన్నా కూడా నడిచింది.కాని ఇప్పుడు అనసూయ కనుక వైల్డ్ డాగ్ సినిమా పై కామెంట్ చేస్తే ఎవరు ఒప్పుకోరు.
అందుకే ఆమె మౌనంగా ఉంటుందని ఈ సందర్బంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.