బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది పంచ్ లను అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆయన పంచ్ లను విమర్శించే వాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు.అయితే హైపర్ ఆది మాత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు హద్దులు మీరి పంచ్ లు వేస్తూ ఉంటారు.
ఆ పంచ్ లపై విమర్శలు వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోరు.జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనసూయపై పంచ్ లు వేస్తారనే సంగతి తెలిసిందే.
తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆది స్కిట్ లో ఒకమ్మాయి నరేష్ ను రాత్రి 9 గంటలకే ఇంటికి వచ్చారంట కదా బయటేం చేశారు.కాలింగ్ బెల్ అందేలా పెడితే లోపలికొచ్చేవాడు అది అందక ఖాళీగా బయటే కూర్చున్నాడు అని ఆది చెబుతాడు.
ఆ తర్వాత నరేష్ నాకు బీపీ పెరుగుతుందని ఆదితో చెప్పగా బీపీ కూడా పెరుగుతుందా నువ్వెప్పుడు పెరుగుతావ్ అంటూ ఆది నరేష్ పై పంచ్ వేస్తాడు.
ఆ తర్వాత ఒక అమ్మాయితో పొద్దున నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా అని చెప్పి అనసూయను చూడగా చంపేస్తా అని అనసూయ వార్నింగ్ ఇస్తుంది.అందుకే మీతో నేను ఏమీ చేయట్లేదని ఆది అంటాడు.ఆ తరువాత అనసూయతో ఆది నువ్వు మంచం రెడీగా పెట్టాలని మరో అమ్మాయిని మల్లెపూలు రెడీగా పెట్టాలని చెబుతాడు.
రోహిణి నేనేం పెట్టాలని అడగగా నువ్వు బయటకు వెళ్లి తలుపుకు గొళ్లెం పెట్టు అని చెబుతుంది.
జులై నెల 8వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఆది వేసిన పంచ్ లను అనసూయ స్పోర్టివ్ గా తీసుకున్నా పెళ్లైన యాంకర్ పై అలాంటి పంచ్ లు వేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.