తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ ఛానల్ లో ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “జబర్దస్త్” కార్యక్రమం లో హోస్ట్ గా వ్యవహరిస్తూ తన గలగల మాటలు మరియు అందాల ఆరబోతతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్.అయితే ఈ అమ్మడు కేవలం బుల్లితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ మరియు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తోంది.
కాగా ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగులో “థాంక్యూ బ్రదర్” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, వైవా హర్ష, ఆదర్శ బాలకృష్ణ, తనికెళ్ల భరణి, అన్నపూర్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని మొదటగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేనందున ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అయిన “ఆహా”లో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
దీంతో ఈ చిత్రం ఈ నెల ఏడవ తారీఖున నుంచి ఆహాలో ప్రసారం కానుంది.
అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ అనసూయ ఓ ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా ఈ అమ్మడు పలు ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో కొంతమంది నెటిజన్లు ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ అనసూయని ట్రోల్స్ చేస్తున్నారు.అంతే కాకుండా ఫోటో షూట్ కార్యక్రమం నిర్వహించిన సమయంలో అనసూయ మాస్కు కూడా ధరించకపోవడంతో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.