టాలీవుడ్లో యాంకర్ నుండి హీరోయిన్గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు.వారిలో గ్లామర్ రోల్స్ చేసే వారిలో ఈమధ్య ఎక్కువ పేరు సంపాదించుకున్న భామలు అనసూయ, రష్మి.
బుల్లితెరపై పొట్టి డ్రెస్సులతో ఫేమస్ అయిన వీరిద్దరు సినిమాల్లోనూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నారు.ఇక ఈ ఇద్దరిలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ నిత్యం సినిమాల్లో కనిపిస్తున్న బ్యూటీ అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.
కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్లా మారిందని చెప్పాలి.ఇక ఆ పాత్ర చేసిన దగ్గర్నుండీ వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ యంగ్ హీరో చిత్రంలోనూ ఆమె ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది.యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో హీరో తల్లి పాత్రలో తొలుత నటి ఇంద్రజను తీసుకున్నారు.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ తమిళనాడులో విశ్వరూపం చూపుతుండటంతో అక్కడి నుండి వచ్చి హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొనలేనని ఇంద్రజ చిత్ర యూనిట్కు తెలపడంతో ఆమె పాత్రలో యాంకర్ అనసూయను తీసుకున్నారట.అనసూయ కూడా ఈ పాత్ర ప్రాధాన్యత నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి అమ్మ పాత్రలో అనసూయ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.