బుల్లితెర లేడీ యాంకర్లు ఎంతమంది ఉన్నా అనసూయకు ఉన్న క్రేజ్ వేరు అనే సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా అనసూయకు అవకాశాలు పెరుగుతుండగా ఎన్ని అవకాశాలు వచ్చినా అనసూయ జబర్దస్త్ షోను మాత్రం వీడటం లేదు.
పెళ్లై పిల్లలున్నా యంగ్ గా కనిపించే అనసూయ తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు కమర్షియల్ గా హిట్లు కావడం గమనార్హం.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
పైకి పటారం లోన లొటారం లిరిక్స్ తో కూడిన మూడు నిమిషాల నిడివి గల ఈ స్పెషల్ సాంగ్ కోసం అనసూయ ఏకంగా 15 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది.స్టార్ హీరోయిన్లకు ధీటుగా అనసూయ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం గమనార్హం.
అనసూయ ఈ స్పెషల్ సాంగ్ కోసం 20 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా మేకర్స్ 15 లక్షల రూపాయలకు ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.అనసూయ స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
తెలుగులో అనసూయ ఖిలాడి సినిమాతో పాటు రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు.తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో, మలయాళంలో మమ్ముట్టి సినిమాలో కూడా అనసూయ నటిస్తున్నారు.
మరోవైపు చావుకబురు చల్లగా సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి.ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత సరైన సక్సెస్ లేని కార్తికేయ, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోని లావణ్య త్రిపాఠి చావుకబురు చల్లగా సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.అనసూయ ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.