తెలుగులో పలు రకాల షోలు నిర్వహిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది యాంకర్ అనసూయ.అయితే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి పుకార్లు మరియు తన పై కామెంట్ చేస్తున్నటువంటి ట్వీట్లపై స్పందిస్తున్నారు అనసూయ.
కొందరు తెలియని వ్యక్తులు తనను టార్గెట్ చేసి తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అనసూయ.
అయితే ఈ విషయంపై యాంకర్ అనసూయ స్పందిస్తూ ఇప్పటికే సైబర్క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
అయితే అనసూయ చేసినటువంటి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నట్లు పోలీసులు మహిళలపై అసభ్యంగా కామెంట్లు చేస్తూ మరియు పోస్ట్ లు పెడుతున్నటువంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు.దీంతో అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.
అంతేగాక తనపై ఇలాంటి రూమర్స్ మరియు కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్లని అసలు వదలనని అంతేగాక వారిని శిక్షించే వరకు పోరాడుతానని అంటోంది ఈ అమ్మడు.ఈ విషయంపై సోషల్ మీడియా మధ్య ఉన్నటువంటి పేస్ బుక్ లో కూడా వీడియో లైవ్ చేస్తూ ఇలా మహిళలతో అసభ్య కరంగా ప్రార్థించే వారికి సవాల్ విసిరింది.
ఇంకో రెండు రోజుల్లో సామూహిక అరెస్టులు చేయిస్తానని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక తాను ప్రస్తుతం నెలరోజులపాటు బిజీ బిజీగా గడుపుతున్నానని అందువలన ఇంకో రెండు రోజుల్లో లో తనపై చేస్తున్నటువంటి కామెంట్ల గురించి క్షుణ్ణంగా పోలీసులకు వివరించి వారి అంతు చూస్తానని చెబుతోంది ఈ అమ్మడు.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి ఓ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.అంతేకాక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న టువంటి ఈ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.