జబర్దస్త్ లో వాళ్లు ఇక  కనిపించరట...

టాలీవుడ్ బుల్లితెరలో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఎంతగా పాపులర్ అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ టీవీ ఛానల్ లో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యేటువంటి ఈ కామెడీ షో కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

 Jabardasth, Tollywood Comedy Show, Etv, Anasuya, Rashmi Gautam, Manjusha, Vishnu-TeluguStop.com

కాగా తాజాగా ఈ కామెడీ షో గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లలో యాంకర్లుగా కొనసాగుతున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్ లకి షో నిర్వాహకులు తొందరలోనే గుడ్ బై చెప్పనున్నారని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

కాగా ఈ ఇద్దరి యాంకర్లకు షో నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో పారితోషకం ముట్ట చెబుతున్నారని, ఈ  నిర్వహణ వ్యయం కొంతమేర భారంగా మారిందని అందువల్లనే షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే వీరి స్థానాల్లో  ప్రస్తుతం తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి యాంకర్ మంజూష మరియు విష్ణు ప్రియ లను తీసుకోవడానికి షో నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది.మరోపక్క రష్మి గౌతమ్ మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

మరి యాంకర్ మంజూష, విష్ణు ప్రియలు అనసూయ మరియు రష్మి గౌతమ్ ల స్థానాల ను భర్తీ చేస్తారో లేదో చూడాలి. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube