యాంకర్ గా కెరియర్ ప్రారంభించి, తన అందం, గ్లామర్ తో జబర్దస్త్ కామెడీ షోకి కలర్ తీసుకొచ్చిన హాట్ యాంకర్ అనసూయ క్షణం సినిమాతో నటిగా కూడా కెరియర్ ప్రారంభించింది.మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తర్వాత సుకుమార్ రంగస్థలం సినిమాలో రంగంమత్త పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తనదైన ముద్ర వేసుకుంది.
ఇండస్ట్రీలో రంగంమత్తగా పాపులర్ అయిపొయింది.ఈ పాత్ర తర్వాత టాలీవుడ్ లో నటిగా ఆమెకి అవకాశాలు పెరిగాయి.
ప్రత్యేక పాత్రలు అంటే దర్శకులకి ముందుగా అనసూయ కనిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఆమె చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రకి ఎంపికైంది.
అలాగే పుష్ప సినిమాలో కూడా నటించబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే కృష్ణ వంశీ రంగ మార్తాండ సినిమాలో కూడా అనసూయ కీలక పాత్ర చేస్తుంది.
మరాఠీ లో సూపర్ హిట్ అయిన నట సమ్రాట్ చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు.ఈ సినిమాలోని అనసూయ చేయబోతున్న పాత్ర గురించి క్లారిటీ వచ్చింది.ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా కనిపించబోతుంది.దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో భారతీయ హిందూ సంప్రదాయాలాలో ఓ రెండు వందల ఏళ్ల క్రితం ఉండేది.
ఓ విధంగా చెప్పాలంటే ఆ పాత్రని వేశ్యగా చిత్రీకరిస్తారు.అలాంటి పాత్రలో అనసూయ నటించడం అంటే గొప్ప విషయం అని చెప్పాలి.ఈ సినిమాలో ఆమె పాత్రకి అనుగుణంగా ఓ ప్రత్యేకపాట కూడా అనసూయ మీద ఉండబోతుంది అని సమాచారం.మరి రంగంమత్తలా జీవించిన అనసూయ దేవదాసిని పాత్రలో ఎలా కనిపించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.