ప్రస్తుతం టాలీవుడ్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాట్ యాంకర్ అనసూయ మారేందుకు అడుగులు వేస్తుంది.అందుకు తగ్గట్లుగానే ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.
రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర వలన అనసూయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.ఇప్పటి నుంచి టాలీవుడ్ లో ఫిమేల్ పవర్ ఫుల్ పాత్రలకి సరైన ఆర్టిస్ట్ లేని సమయంలో అనసూయ అలాంటి రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
దీంతో చాలా మంది దర్శకులు ఇప్పుడు తమ సినిమాలలో కీలకమైన క్యారెక్టర్ రోల్స్ ని డిజైన్ చేసుకుంటూ అనసూయని సంప్రదిస్తున్నారు.అయితే అనసూయ సినిమా రేంజ్ బట్టి పాత్రలు ఎంపిక చేసుకుంటుంది.
అందులో భాగంగానే ప్రస్తుతం ఈ అమ్మడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతుంది.అలాగే చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో అనసూయ మేరవనుంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.మళ్ళీ ఎప్పటికి షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనసూయ చేస్తున్న పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాలో అనసూయ ఓ బందిపోటు రాణిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అలాంటిదేం లేదు ఇందులో కళ్లు కనపడని మధ్యవయస్కురాలిగా అనసూయ కనిపించబోతుంది అని చర్చించుకుంటున్నారు.ఆ పాత్ర కారణంగానే సినిమా లో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఏది ఏమైనా పుష్ప సినిమాలో ఆమె చేస్తున్న పాత్ర కూడా రంగస్థలం తరహాలో ఒక బలమైన క్యారెక్టర్ అని తెలుస్తుంది.