జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ రెగ్యులర్గా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో టచ్లో ఉంటుంది.వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారితో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు ఆమెను కొందరు ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయడం కూడా జరుగుతుంది.ఆ సమయంలో ఆమె అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది.
తాజాగా మరోసారి ఒక నెటిజన్కు ఇచ్చిన కౌంటర్ గురించి చర్చ జరుగుతోంది.అనూహ్యంగా ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
మీ జబర్దస్త్లో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం పంచ్లు వేసుకోవడం తప్ప ఇంకేం చేస్తారంటూ ప్రశ్నించగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ ఈ రోజు మీకు జ్ఞానోదయం కల్పించాలనుకుంటున్నాను అంటూ మొదలు పెట్టింది. జబర్దస్త్లో వచ్చే ప్రతి మాట మరియు ప్రతి యాక్షన్ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ కల్పించేందుకు ఆ విషయాన్ని కార్యక్రమం ఆరంభంకు ముందే వేస్తాం.
అందులో క్లీయర్గా ఎవరిని ఉద్దేశించినవి కాదు అంటూ మెన్షన్ చేయడం జరుగుతుంది.
కమెడియన్స్ నాపై పంచ్ వేసినా ముందు నాకు ఆ విషయాన్ని చెప్తారు.జబర్దస్త్లోని కమెడియన్స్ అంతా చాలా మంచి వారు.వారు జెంటిల్మెన్స్ కాబట్టే వారు హుందాగా కామెడీ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.
కామెడీ కోసం కాస్త పంచ్లు వేయడం డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం చేస్తారు తప్ప వారు తప్పుగా ఎప్పుడు ప్రవర్తించలేదు అంటూ చెప్పుకొచ్చింది.ఎవరైనా అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తే వెంటనే వారిని పంపించేస్తారు.
అందుకే జబర్దస్త్లో అలాంటి వారు ఉండరు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.