న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా టర్న్ తీసుకొని తన అందంతో అందరిని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అనసూయ, ఈ షో ద్వారా మొదటిసారి యాంకరింగ్ కి షార్ట్ డ్రెస్సులతో కొత్త అందం తీసుకొచ్చిన అనసూయ చాలా వేగంగా టాప్ యాంకర్ గా మారిపోయింది.ఇక ఈమె అందానికి అందరూ ఫిదా అయిపోతూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.
దీంతో క్షణం సినిమాలో ఊహించని విధంగా అవకాశం సొంతం చేసుకొని మొదటి సినిమాతోనే నటిగా ప్రూవ్ చేసుకుంది.ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిరి చూసుకునే అవకాశాలు లేకుండా మరింత స్పీడ్ పెంచింది.
ఓ వైపు టీవీ షోలతో సందడి చేస్తూనే సినిమాలలో కీలక పాత్రల కోసం దర్శకులకి ఎర వేస్తుంది.రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర తర్వాత ఆమె పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ కారణంగా ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.
అయితే ఆమె మాత్రం వచ్చిన సినిమాలు అన్ని చేసుకుంటూ పోకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటుంది.
ప్రస్తుతం ఆమె చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప సినిమాలలో కీలక పాత్రలు చేయడానికి అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా ఈ భామ అవకాశం సొంతం చేసుకుంది.
సుమంత్ అశ్విన్ హీరోగా గురు దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ప్రారంభమైన షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు.
ఈ సినిమాలో ముందుగా ఒక కీలక పాత్ర కోసం ఇంద్రజని ఫైనల్ చేశారు.అయితే ప్రస్తుతం ఆమె చేయడానికి ఆసక్తి చూపించాకపోవడంతో ఆ పాత్ర కోసం అనసూయని సంప్రదించి ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒకే చెప్పడంతో అంగీకరించినట్లు తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం.
.