బుల్లితెర యాంకర్లలో సామాజిక స్పృహ ఉన్న అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ ఒకరు.సామాజిక విషయాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రజలకు కీలక సూచనలు చేస్తూ ఉంటారు.
చాలా సంవత్సరాల క్రితమే అనసూయ ఇండస్ట్రీకి పరిచయమైనా జబర్దస్త్ షో ద్వారానే ఆమెకు గుర్తింపు వచ్చింది.మధ్యలో జబర్దస్త్ షోకు కొంతకాలం దూరమైన అనసూయ మళ్లీ ఆ షోలో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన మెసేజ్ కొడుకు చెప్పిన మాటలకు ఆమె ఎంత బాధ పడిందో, ఎంత మనోవేదనకు గురైందో అర్థమయ్యేలా చేస్తోంది. 2020 సంవత్సరం పేద ధనిక వర్గాలు, సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడాల్లేకుండా అందరి జీవితాల్లో బ్యాడ్ ఇయర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ అందరికీ భారీ నష్టాలను మిగిల్చాయి.
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు.
వైరస్ నుంచి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.మరోవైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజల జనజీవనం అస్తవ్యస్తమయింది.ఈ పరిస్థితులను చూసి బాధ పడ్డ అనసూయ కొడుకు ఆమెతో దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
” అమ్మా.! నాకు 2017, 2018 సంవత్సరాల్లోకి తిరిగి వెళ్లిపోవాలని ఉంది.ఆ సమయంలో కోవిడ్ లేదు.వరదలు లేవు.ఆ సంవత్సరాల్లో నేను ఎంతో సంతోషంగా జీవనం సాగించాను” అని చెప్పాడు.
తన కొడుకు చెప్పిన మాటలకు చలించి కన్నీటిపర్యంతమైన అనసూయ తన కొడుకు చెప్పిన మాటలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు అన్న మాటలు వింటే కన్నీళ్లు ఆగడం లేదని చెప్పుకొచ్చారు.