హాట్ యాంకర్ గా జబర్దస్త్ షో తో ఒక్కసారిగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ అనసూయ.న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత పెళ్లి చేసుకొని చాలా గ్యాప్ తీసుకొని జబర్దస్త్ షోతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన అనసూయకి తరువాత అదృష్టం దారిద్ర్యం పట్టినట్లు పట్టింది.
ఆమె పట్టిందల్ల బంగారం అయినట్లు ఆ షో ద్వారా టెలివిజన్ లో చాలా షోలు చేసే అవకాశం సొంతం చేసుకుంది.యాంకరింగ్ కి గ్లామర్ ని తీసుకొచ్చిన ఈ బ్యూటీ చాలా మంది గ్లామర్ యాంకర్స్ కి రోల్ మోడల్ అయ్యింది.
ఇక క్షణం సినిమాతో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సత్తా చాటింది.తరువాత రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర అయితే ఆమె కెరియర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.
అంత గొప్ప పాత్రని సుకుమార్ ఆమెకి అందించిన స్టార్ ఇమేజ్ అందించాడు.ప్రస్తుతం ఆమె చేతిలో ఆచార్య, పుష్ప రూపంలో రెండు పెద్ద సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ హాట్ యాంకర్ నటిగా తన కెరియర్ లో మరింత విస్తరించుకుంటూ ఇతర భాషలలో కూడా అవకాశం దక్కించుకుంటుంది.తాజాగా కోలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో తనకి అవకాశం వచ్చినట్లు అనసూయ తెలియజేసింది.
అందులో తాను చేయబోయే పాత్ర చాలా కొత్తగా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని స్పష్టం చేసింది.అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం అనసూయ రివీల్ చేయలేదు.
అయితే ఏదో పెద్ద హీరో సినిమాలోనే అనసూయ అవకాశం సొంతం చేసుకొని ఉంటుంది అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.