అనసూయ కు నేటి జనుల నుండి వచ్చే ట్రోలింగ్స్ అంతా ఇంతా కాదు.ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఏదైనా పోస్ట్ పెట్టడమే ఆలస్యం వెంటనే రంగంలోకి దిగుతారు నెటిజనులు.
ఇక ఆమె పెట్టే పోస్టులు కూడా అలాగే ఉన్నట్లు అనిపిస్తుంటాయి.అంతే కాకుండా తను షేర్ చేసే ఫోటోలను చూసినట్లయితే.
యువతను మాత్రం కన్నార్పకుండా చేస్తుంది.
అనసూయకు బుల్లితెర లోనుకాకుండా వెండితెరపై కూడా చెప్పలేనంత క్రేజ్ ఉంది.
ఆమె వయసుతో పాటు తన గ్లామర్ ను పెంచుకుంటూ పోతూ ఇంకా పాతికేళ్ల అమ్మాయిల ఉన్న తన అందాలను ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించిన అనసూయ సోషల్ మీడియాలో కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరో నేటి జన్ పై చేసిన కామెంట్ వైరల్ గా మారింది.
తాజాగా అనసూయ కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.చూడటానికి ఐటెం సాంగ్ లా ఉన్న ఆ పాట అనసూయ దృష్టికి మాత్రం స్పెషల్ సాంగ్ గా ఉందని తెలిపింది.అమ్మాయిలను వస్తువులుగా చూసే వాళ్ళు మాత్రమే ఐటెం సాంగ్ అంటారని చెప్పుకొచ్చింది.
అయితే కార్తికేయ, అనసూయ నటించిన పైన పటారం అనే పాట ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.
అందులో అనసూయ వేసిన స్టెప్పులను చూసిన నెటిజనులు కామెంట్లతో నింపుతున్నారు.
ఇక ఇందులో ఓ నేటి జన్ చేసిన కామెంట్ కు అనసూయ బాగా రియాక్ట్ అయ్యింది.ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే తెలుగు వాళ్లకు తెలుగులో విలువ ఇవ్వరు టాలెంట్ చూడరు మళ్లీ సినిమాల్లోకి తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోరు అని అంటారు వస్తే ఇలా తప్పుగా తిడతారు ఇలా మాట్లాడితే తెలుగు వాళ్ళు ఇండస్ట్రీకి రావాలంటే భయపడతారు.
మారండి కొంచమైనా” అని ఆ నేటి జన్ చేసిన కామెంట్ కు అనసూయ ఎమోషనల్ అవుతూ ఇలాంటి కామెంట్లు చూసినప్పుడే అంతా మంచి జరుగుతుందని ఆశ కలుగుతుందని, అందుకే మంచి జరిగే వరకు ప్రయత్నాన్ని వదలను.ఇలాంటివి ధైర్యంగా చెప్పే హృదయం, గట్స్ ఉన్నందుకు థాంక్స్ అంటూ తెలిపింది.
ప్రస్తుతం ఆ కామెంట్ అనసూయ షేర్ చేయగా వైరల్ గా మారింది.