తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనగామ జిల్లా దేవరుప్పులలో నిర్వహించిన బహిరంగ సభో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్న ఆయన.దాడులకు పాల్పడితే బీజేపీ భయపడదని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో 1947 కు ముందు ఉన్న పరిస్థితులే దర్శనమిస్తున్నాయన్నారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే, కేసీఆర్ దోచుకుపోతున్నారని విమర్శించారు.
అనంతపురం దేవరుప్పుల ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి, స్థానిక సీపీ తీరుపై మండిపడ్డారు.తమపై దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నా, భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.