యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హిందీలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే సినిమా ఆది పురుష్.మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాని ఓంరౌత్ త్రీడీలో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించబోతున్నారు.
ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఇండియా వైడ్ గా ఆది పురుష్ హాట్ టాపిక్ అయ్యింది.అందరికి తెలిసిన రామాయణం కథాంశం కావడం, అందులో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ నటించబోతూ ఉండటం అంతటా ఆసక్తి ఏర్పడింది.
అయితే దీనిని ఓం రౌత్ ఎలా చెప్పబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు అయిన రావణుడు పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని ఫైనల్ చేశారు.
దీంతో సినిమా టాలీవుడ్, బాలీవుడ్ నటుల కలయికలో ఉండబోతుంది అనే విషయం అర్ధమైంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సీత పాత్ర కోసం చాలా రోజులుగా చర్చ నడుస్తుంది.సీతగా సౌత్ ఇండియన్ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపించింది.అయితే ఆ వార్తలో వాస్తవం లేదని కీర్తి సురేష్ కొట్టిపారేసింది.
తరువాత అనుష్క శెట్టి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేర్లు వినిపించాయి.తరువాత కృతి సనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు కొత్తగా అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది.ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం రౌడీ స్టార్ కి జోడీగా పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాలో నటిస్తుంది.
అయితే ఓం రౌత్ టీం సీత పాత్ర కోసం అనన్యపాండేని సంప్రదించారని, ఆమెతో చర్చలు జరుగుతున్నాయని టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసే వరకు వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.