బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న అనన్యా పాండే ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తుంది.పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే అలరిస్తుందని అంటున్నారు.
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.సినిమాలో విజయ్, మైక్ టైసన్ సీన్స్ యాక్షన్ ప్రియులను బీభత్సంగా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.
ఇక అనన్యా పాండే ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందని చెప్పొచ్చు.అందుకే తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంటుందని అంటున్నారు.సందీప్ వంగ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాలో అనన్యా పాండేని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.లైగర్ తర్వాత అనన్యా పాండే రేంజ్ మారుతుందని తెలుస్తుంది.
అందుకే ముందుగానే ప్రభాస్ స్పిరిట్ కోసం ఆమెను ఫిక్స్ చేసుకున్నారు.ప్రభాస్ తో మరో పాన్ ఇండియా సినిమాలో అనన్యా పాండే సత్తా చాటనుంది.
ప్రభాస్ సినిమా మాత్రమే కాదు మహేష్, ఎన్.టి.ఆర్ కూడా అనన్యా పాండేని హీరోయిన్ గా తమ సినిమాలో రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.