టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్.ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
లైగర్ సినిమాతో అనన్య పాండే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఒక వైపు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఇప్పటికే పలు సినిమాలు వాయిదా వేశారు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా గురించి బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ బాగానే కొనసాగుతోంది.ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.
అదే విధంగా అనన్య పాండే కూడా హీరోయిన్ గా మొత్తం దక్షిణాది సినిమాల భాషలన్నింటిలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సందర్భంగా అనన్య పాండే మాట్లాడుతూ.ఒకేసారి నాలుగు కొత్త సినిమా పరిశ్రమల లోకి ప్రవేశించడం భయంగా ఉంది.
అదేవిధంగా సూపర్ ఎక్సైటింగ్ గా కూడా ఉంది అని తెలిపింది.లైగర్ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే.
దీనితో మొదటిసారిగా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు పరిచయం కానుంది.
అయితే ఇప్పటివరకు అనన్య కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసింది.అనన్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా లైగర్ సినిమా కాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇక విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాని పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.