ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురంలో ఓ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.అనంతపురానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్లతో ఉడాయించేందుకు చూసింది.స్థానిక విద్యుత్ నగర్లో ఉండే జయలక్ష్మి అక్కడ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉండేది.
బ్యూటీ పార్లర్ నడుపుతున్న జయలక్ష్మి మెల్లగా చిట్టీల బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది.అయితే ఆమె బ్యూటీ పార్లర్ కు వచ్చే చాలా మంది ఆడవాళ్లు ఆమెను నమ్మి గుడ్డిగా చిట్టీలు వేయడం మొదలు పెట్టారు.
కానీ అక్కడే జయలక్ష్మి అసలు రంగు బయట పడింది.
మహిళలు చిట్టీలు వేసిన తర్వాత చిట్టీని పాడిన వారిని సమయానికి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుండడం జయలక్ష్మి మోసం చేస్తుందనడానికి మొదటి అనుమానం.
ఇలా జయలక్ష్మి మీద అక్కడ ఉంటూ ఆమె వద్ద చిట్టీలు వేసిన అనేక మందికి అనుమానం వచ్చింది.అయినా కానీ ఎలాగోలా కంటిన్యూ అవుతూ వస్తున్నారు.
చిట్టీలు పాడిన అనేక మందికి జయలక్ష్మి డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటూ సాకులు చెబుతోంది.ఇలా ఉండగా.ఒక రోజు అర్ధ రాత్రి వేళ జయలక్ష్మి తాను కలెక్ట్ చేసిన దాదాపు రూ.20 కోట్లతో ఉడాయించేందుకు ప్రయత్నించింది.
కానీ ఆమెను అక్కడి వారు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.ఇక పోలీసులకు అప్పగిస్తే అంతా చూసుకుంటారని భావించిన వారికి ఒక్క సారి దిమ్మతిరిగి బొమ్మ కనబడింది.అక్కడి పోలీసులు కూడా మిమ్మల్ని చిట్టీలు ఎవరు వేయమన్నారు.అయినా ఎవర్ని అడిగి చిట్టీలు వేసారంటూ మోసపోయిన బాధితుల మీదనే ఫైర్ అయ్యారు.ఇలా పోలీసులు కూడా రివర్స్ కావడంతో చేసేదేం లేక బాధితులు పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ఎస్సైకి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.తమకు న్యాయం చేయాలని ఆరోపించారు.