ఆర్ట్ డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఆనంద్ సాయి.. పవన్ సినిమాతోనే

టాలీవుడ్ నెంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పాటు పని చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి ఆనంద్ సాయి.కెరియర్ లో ఏకంగా వంద సినిమాల వరకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఆనంద్ సై ప్రస్తుతం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు.

 Anand Sai Re-entry With Pawan Kalyan Movie, Art Director, Harish Shankar, Mythri-TeluguStop.com

ఈ ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు.ఒకప్పటి ఆలయ శిల్ప సౌందర్యానికి ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి ఆలయాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ కారణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం యాదాద్రి ఆలయం పూర్తి బాధ్యతని ఆనంద్ సాయికి అప్పగించారు.ఇదిలా ఉంటే ఈ ఆలయ నిర్మాణం తుది దశకి చేరుకోవడంతో మరల ఇతను సినిమాలపై దృష్టిపెట్టాడు.

ఈ నేపధ్యంలో ఐదేళ్ళ తర్వాత రీఎంట్రీ మూవీకి సంబందించిన అప్డేట్ తాజాగా బయటకొచ్చింది.

ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్ మధ్య ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.

ఇప్పుడు ఈ ఆర్ట్ డైరెక్టర్ రీఎంట్రీ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తోనే చేస్తూ ఉండటం విశేషం.మైత్రీ మూవీ మేకర్స్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.క్రిష్ మూవీ పూర్తయిన వెంటనే దీనిని హరీష్ శంకర్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.ఇక ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు.ఈ విషయాన్ని దృవీకరిస్తూ చిత్ర యూనిట్ తాజాగా వెల్ కమ్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube