ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆనంద్ మహీంద్రా తన పనిలో తాను బిజీగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు.
తన ట్విట్టర్ అకౌంట్లో సోషల్ మీడియా ద్వారా యువతలో ఆలోచన రేకెత్తించే మోటివేషనల్ వీడియోలను, అలాగే ఆయనకు స్ఫూర్తి అనిపించిన వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచేస్తారు.తాజాగా, ఆనంద్ మహీంద్రా మరో వీడియోను తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
దానిని చూసిన నెటిజన్లు ఆయనపై మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సదరు వీడియోని పోస్టు చేస్తూ… “ఎలక్ర్టానిక్ గాడ్జెట్లతో నిండిపోయిన స్మార్ట్ యుగంలో ఇది నిజంగా అద్భుతం.
ఈ ప్రిమిటివ్ మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైన యంత్రం మాత్రమే కాదు మొబైల్ శిల్పం” అనే క్యాప్షన్ కూడా ఇవ్వడం కొసమెరుపు.ఇక వీడియోలో ఏముందంటే.కట్టెతో తయారు చేసిన ఓ యంత్రం ఓ వైపు పొలాల్లోకి నీటిని తోడుతుండగా.మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే రోకలిగా.
ఒకేసారి రెండు పనులు చేసేలా కనిపిస్తోంది.దాని పనితీరును చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోలకు సోషల్ మీడియా అడ్డాగా మారింది.దాంతో ఇలాంటి కళలన్నీ బయటపడుతున్నాయి.పైగా ఇలాంటి ప్రముఖులు వాటిని షేర్ చేయడం ద్వారా ఎక్కడో మారుమూలన గ్రామాల్లో నివసించేవారు కూడా సెలిబ్రిటీలు అయిపోతున్నారు.ఓ రకంగా చెప్పాలంటే ఆనంద్ మహీంద్రా ఓ అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని చెప్పుకోవాలి.లేకపోతే అలాంటివారిని ఊరికే ఎవరు సపోర్ట్ చేస్తారు.అలాంటివి ప్రమోషన్స్ చేయాలంటే ఎంత డబ్బున్నవాళ్ళైనా ఫ్రీగా చెయ్యరు.
అలాంటిది ఆనంద్ మహీంద్రా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు.