కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.కోవిడ్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు కొన్ని నెలల పాటు లాక్ డౌన్ అమలు చేశాయి.
దీంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.దీంతో లాక్ డౌన్ అమలు చేసిన రోజులు అన్ని కరోనా అదుపులో ఉండగా అన్లాక్ చేసిన అనంతరం ప్రజలు విచ్చలవిడి తనం కారణంగా కరోనా వ్యాప్తి దారుణంగా పెరిగింది.
దీంతో ఎందరో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.రాష్ట్రం, దేశం అన్లాక్ ప్రకటించినప్పటికీ బయటకు వెళ్లాలంటే భయం అవుతుంది.ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో ఎంతోమంది ప్రజలు బయటకు వెళ్లాలా? వద్ద అనే ఆలోచనలో పడ్డారు.ఇంకా ఇదే విషయాన్నీ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా వెరైటీగా చెప్పారు.
ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు కూడా సరికొత్తగా ట్విట్ చేశారు.తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్ చేస్తూ ”నా రూమ్లో ఒక పెద్ద సీతాకోకచిలుక కనిపించింది.
అది బయటకు వెళ్లడానికి తెగ ప్రయత్నిస్తోంది.నేను వెంటనే దాని దగ్గరకు వెళ్లి చేత్తో సీతాకోకచిలుకను పట్టుకొని జాగ్రత్తగా బయటికి వదిలేశాను.
అది ఎంతో వేగంగా నా ఇళ్లు దాటి బయటకు వెళ్లిపోయింది.అది చూడగానే.మన పరిస్థతి కూడా సీతాకోకచిలుకలాగానే ఉంది.ఎప్పుడు ఈ కరోనా వైరస్ తగ్గిపోతుందో.ఆ వైరస్ తలుపులు బద్దలు కొట్టుకొని స్వేచ్ఛగా బయటకు వెళ్తామా అనిపించింది” అంటూ కరోనా భయం గురించి ట్విట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.