ఆనంద్ మహీంద్రా. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
మహీంద్రా ఇప్పటికే ఎంతోమంది సామాన్యులను ఆదుకొని తన సహృదయాన్ని చాటుకున్నారు.అయితే తాజాగా అతను ఒక కస్టమర్ ట్విట్కు స్పందించిన తీరు నెటిజన్లను ఫిదా చేస్తోంది.
ఒక కస్టమర్ తన పదేళ్ల కష్టంతో తనకంటూ ఒక కారును కొనుగోలు చేశాడు.ఈ సంతోషాన్ని అతను ఆనంద్ మహీంద్రాతోనే పంచుకున్నాడు.
సర్, 10 ఏళ్ల కష్టంతో మీ కంపెనీకి చెందిన కారు కొనుగోలు చేశాను.నన్ను ఆశీర్వదించండి అంటూ అతను ఒక ట్వీట్ చేస్తూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశాడు.
దానికి ఆనంద్ ఇచ్చిన ఆసక్తికర రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.
అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇటీవల మహీంద్రా XUV700 కారును కొన్నాడు.అనంతరం ఆ మహీంద్రా ఎస్యూవీతో తన ఫొటోను ట్వీట్ చేస్తూ.”10 ఏళ్లు హార్డ్ వర్క్ తర్వాత.కొత్త మహీంద్రా XUV 700ని కొన్నాను.మీ బ్లెస్సింగ్స్ కావాలి.” అని మహీంద్రాను ట్యాగ్ చేశారు.దీనికి సమాధానం ఇస్తూ.“థాంక్యూ కానీ నేను ఆశీర్వదించడం ఏంటి.మీ ఛాయిస్ తో మమ్మల్నందరినీ మీరే ఆశీర్వదించారు.
హార్డ్ వర్క్ చేసి సాధించిన మీ విజయానికి అభినందనలు.హ్యాపీ మోటరింగ్.” అని మహీంద్రా రిప్లై ఇచ్చారు.ఆనంద్ మహీంద్రా నుంచి రిప్లే రావడంతో అశోక్ కుమార్ చాలా సంతోషించాడు.అనంతరం మహీంద్రాకి “థాంక్ యూ సార్” అని రిప్లై ఇచ్చాడు.ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.నీ కృషి, శ్రమకు తగిన ప్రతిఫలం లభించింది అంటూ అశోక్ కుమార్కి నెటిజన్లు కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు.