ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ తెలిస్తే చాలు నిముషాల్లో వైరల్ అవుతుంది.సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.
అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.అది కరెక్ట్ కాదో కూడా తెలియకుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.
పెద్ద పెద్ద వారు కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
అలంటి వారిలో ఆనంద్ మహీంద్రా ముందు వరసలో ఉంటాడు.
ఆయన ఏదైనా ట్వీట్ చేసారంటే అది నిముషాల్లో వైరల్ అవుతుంది.అంతలా యువత ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.
ఆనంద్ మహీంద్రా కు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిందంటే వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు.అదే అలవాటుగా ఇప్పుడు కూడా ఒక అద్బుతమైన విషయాన్నీ ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక న్యూస్ షేర్ చేసుకున్నారు.అది ఏంటంటే.ఒక స్విమింగ్ ఫూల్ ఫోటోను తన ఖాతాలో షేర్ చేసాడు.
అయితే అది అలంటి ఇలాంటి స్విమింగ్ ఫూల్ కాదు.ఈ స్విమింగ్ ఫూల్ ఏ ఇంట్లోనో కృత్రిమంగా ఏర్పాటు చేసింది కాదు.ప్రకృతి సిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన ఫూల్ అది.ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ఆనంద్ మహేంద్ర అనుకుంటున్నారట.
అయితే ఫూల్ ఎక్కడ ఉందొ ఆనంద్ మహీంద్రాకు కూడా తెలియదట.మీలో ఎవరికైనా తెలిస్తే లొకేషన్ పంపండి నేను అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయాలని అకుంటున్నాను అని ఆయన ట్వీట్ చేసాడు.దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఫూల్ ఎక్కడ ఉందొ అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.ఆ ఫూల్ గురించి మొదట సిద్దార్థ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.
ఇప్పుడు ఆనంద్ మహీంద్ర ఆ ఫోటో షేర్ చేయడంతో జనాల్లోకి ఈజీగా వచ్చింది.