దేశీయ బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి.అతను ఓ వ్యాపారవేత్త కంటే కూడా సోషల్ మీడియాలో మంచి యాక్టవిస్టుగానే అందరికీ సుపరిచితులు.
దానికి కారణం అతను ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను ట్విట్టర్ వేదికగా తన అనుచరులతో పంచుకుంటూ వుంటారు.ఈ క్రమంలో తాజాగా ఆయన ఫుట్బాల్ ఆట గురించి ప్రస్తావించారు.
దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలిసిందే.అందులోనూ ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుందంటే అభిమానుల్లో ఆ ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఖతార్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నీ ప్రమోషన్ కోసం ఆ దేశం సహా ఫిపా ఎంతో ఖర్చుచేస్తున్నాయి అన్న సంగతి అందిరికీ తెలిసినదే.ఈ క్రమంలో చిన్నారులకు సంబంధించి మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.“వరల్డ్ కప్ టోర్నీ ప్రచారం కోసం తెలియక ఫిఫా, ఖతార్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి.అయితే ఇంత చవకైన, ఉల్లాసకరమైన వీడియో కలిగించినంత ఉత్కంఠత ఆ ప్రచారంతో వస్తుందని నేను అనుకోవట్లేదు.
ఈ ప్రపంచానికి ఫుట్బాల్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ఆ పిల్లల వీడియో సరిగా వెల్లడిచేస్తోంది!” అని మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు.
సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, అందులో చిన్నారులు ఫుట్బాల్ ఆటకి సమాయత్తమయ్యారు.అయితే వారి ఆడే ఆట సాధారణ ఆటకన్నా కాస్త భిన్నంగా, కాస్త క్రియేటివిటీతో కూడుకొని వుంది.ఇక్కడ చిన్నారులు బాల్ ని కాలితో తంతూ బ్రేక్ డాన్సులు చేయడం ఇక్కడ గమనించవచ్చు.
వారు ఆ ఆట పట్ల చూపుతున్న ఉత్సాహం, మధ్యలో వారు వేస్తోన్న డ్యాన్సులు చూస్తుంటే ముచ్చటేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.