సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.
అది కరెక్ట్ కాదో కూడా తెలియకుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.పెద్ద పెద్ద వారు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తమ అభిప్రాయాలను అందరికి పంచుకుంటు ఉంటారు.
ఇక అలంటి కోవకే చెందుతారు ఆనంద్ మహీంద్ర.ఆయన ఏదైనా ట్వీట్ చేసారంటే అది నిముషాల్లో వైరల్ అవుతుంది.అంతలా యువత ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.ఆనంద్ మహీంద్రా కు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిందంటే వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు.
ఈయన ఒకవైపు తన బిజినెస్ ను చూసుకుంటూనే మరొక వైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు మంచి మంచి విషయాలను అందిస్తూ ఉంటాడు.
ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను అందరికి తెలిసేలా ప్రపంచానికి వారిని పరిచయం చేస్తూ ఉంటాడు.
అలాగే కొన్ని రోజుల ముందు మణిపూర్ కు చెందిన ప్రేమ్ అనే యువకుడి గురించి కూడా ఒక పోస్ట్ షేర్ చేసాడు.ప్రేమ్ అనే యువకుడు చెత్త వ్యర్ధ పదార్దాలతో ఐరన్ మ్యాన్ ను తయారు చేసాడు.
అతడి ప్రతిభను గుర్తించి ఆ యువకుడి మెకానికల్ ఇంజినీరింగ్ చదవడానికి హెల్ప్ చేస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
ఇక ఇప్పుడు ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.ఆయన హెల్ప్ చేస్తానని చెప్పిన దాని ప్రకారం ప్రేమ్ కు హైదరాబాద్ లోని మహీంద్ర విశ్వ విద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం కల్పించి తన మాటను నిలబెట్టు కున్నాడు.మణిపూర్ నుండి హైదరాబాద్ కు వచ్చేందుకు కూడా ఇండిగో ఎయిర్ లైన్స్ సహకరించింది.
ఆ యువకుడికి సహాయం చేసినందుకు ఆనంద్ మహీంద్ర కృతజ్ఞతలు తెలిపాడు.ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ ఆనంద్ మహీంద్రా ను ప్రశంసిస్తున్నారు.