ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా మారారు.ఎంతటి వ్యాపారవేత్త అయినా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటే ఇలాంటి ట్వీట్స్ చూడాల్సివస్తోంది.
ఆయనకు నచ్చిన వీడియోలు,మెచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.రొటీన్ గానే ఆయన ఆమె భార్యకు చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియా వేదికగా ఎంతో మందికి సాయం చేయడానికి వెనుకాడని ఆనంద్ మహీంద్రా, అప్పుడప్పుడు ఫన్నీ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన సతీమణి సహాయం కోరితే కాదని చెప్పకుండానే సుతిమెత్తగా చేయలేననే విషయాన్నీ ఆయన తెలిపిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఆమె కోరిన సాయాన్ని చేయలేను అని చెప్పకుండా ఒక క్రియేటివ్ ట్వీట్ చేశారు, ఇప్పుడు కాస్తా ఆ ట్వీట్ వైరల్ గా మారింది.
“ఈ వర్షాకాలం వారాంతాల్లో మేం ఇంట్లోనే ఉన్నాం.
అప్పుడు నా సతీమణి వంటలో సాయం చేస్తారా అని అడిగింది.నేను ఈ చిత్రాన్ని ఆమెకు పంపి, నా పని ఇలానే ఉంటుంది’ అంటూ ఓ ఫోటోను జత చేసి ట్వీట్ చేశారు.
ఇక అంతే ఆయన ట్వీట్ కు రీట్వీట్లు,లైక్ లు కామెంట్లు హోరందుకున్నాయి.ఆయన చెప్పిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయి భారీ స్థాయిలో రీట్వీట్స్ పెడుతూ, ఆయన కామెడీ ని ఎంజాయ్ చేస్తున్నారు.