ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతి ఒక్క రంగం వారు పెద్ద ఎత్తున కష్టకాలాన్ని వెల్లదీస్తున్నారు.కరోనా దెబ్బకు అందరూ విలవిలలాడిపోతున్నారు.
మొదటి దఫా కరోనా దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలోమరల సెకండ్ వేవ్ మరల మొదటికి తీసుకెళ్లింది.దీంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది.
అంతేకాక మొదటి దఫాలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది.ఇక సెకండ్ వేవ్ లో కూడా అన్ని కంపెనీలు కూడా నష్టాలను భరించలేక ఇదే విధానాన్ని అనుసరించాయి.
దీంతో చాలా మంది ఉద్యోగులు ఈ కరోనా కష్ట కాలంలో రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది.కాని అందరూ తమ ఉద్యోగుల పట్ల అలా ప్రవర్తించరు కదా.దీంతో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఇంతకూ ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయం ఏంటంటే తమ ఉద్యోగలందరికీ ఇన్సూరెన్స్ తో సహా, ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ ను అందించాలని నిర్భయించుకున్నారు.
ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగుల పట్ల ఇంతటి శ్రద్ద తీసుకోవడం చాలా అరుదు అంటూ నెటిజన్లు ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల జల్లు కృపిస్తున్న పరిస్థితి ఉంది.