ఆనంద్ మహేంద్ర వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు.ఫన్నీ వీడియో లను సోషల్ సర్వీస్ వీడియో లను ఇలా ఎన్నో వాటిని ఆయన పోస్ట్ చేస్తూ ఉంటాడు.
ఈ వేధిక గా ఎంతో మందికి ఆయన సాయం కూడా చేశాడు.తాజాగా ఆయన మన ఇండియన్ క్రికెటర్స్ కు తన థార్ ఎస్యూవి కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.
కాకపోతే ఇది అందరికి కాదు.ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆరంగేట్రం చేసిన యువ క్రికెటర్స్ కి ఆయన తన కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నాడు.
ఈ విషయాని తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా తెలియజేశాడు.
వారు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు.
వారి కష్టానికి పలితంగా మేము ఈ చిన్న సాయం చేస్తున్నాం అన్నాడు.ఇందులో మహమ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, శుబ్ మన్ గిల్ల్ లు ఉన్నారు.
ఈ యువ క్రికెటర్స్ ఆస్ట్రేలియా లో ఇండియా టెస్ట్ సిరీస్ గెలవడానికి కీలక పాత్రను పోషించారు.ఆనంద్ మహీంద్ర తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.