ఆ కంపెనీ మీద ఆనంద్ మ‌హీంద్రా ఫ‌న్నీ ట్వీట్ వైర‌ల్‌..

ఆయ‌న ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.నిత్యం వ్యాపార ప‌నుల‌తో బిజీగా ఉండే వ్య‌క్తి.

 Anand Mahindra Funny Tweet On Kellogs Company, Anand Mahindra, Viral News, Anand-TeluguStop.com

అయినా కూడా ఆయ‌న ఓ మామూలు మ‌నిషి మాదిరిగానే నిత్యం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ‌న్నీ పోస్టులు పెడుతూనే ఉంటారు.

ఆయ‌నే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.ఇక ఆయన సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేవి కూడా తెగ వైరల్ చేస్తుంటారు నెటిజ‌న్లు.

ఇక ఆహార ప‌దార్థాల విష‌యంలో చాలా వైర‌ల్‌గా ఉండేవి షేర్‌చేసే ఆనంద్ మ‌హీంద్రా ఇప్పుడు కూడా కెల్లాగ్ ఉప్మాపై చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

కాగా అమెరికాకు చెందిన‌టువంటి కెల్లోగ్ అనే ఆహార ప‌దార్థాల‌కు చెందిన కంపెనీ అప్ప‌ట్లో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు మ‌న ఇండియ‌న్ల టిఫిన్ అలవాట్లను మార్చాలని అనుకున్నారంట‌.

కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇండియ‌న్ల అల్పాహారం మాత్రం ఇప్ప‌టికీ మారలేద‌ని చెబుతున్నారు.అయితే కెల్లాగ్స్ కంపెనీ మాత్రం త‌మ ఆహార ఉత్పత్తినే ఇండియాకు అనుగుణంగా మార్చాల్సి వచ్చింది.

ఇక ఇందుకు సంబంధించిన మీమ్‌ను ఇప్పుడు ఆనంద్ మ‌హీంద్రా తన ట్విట్టర్ వేదిక‌గా పోస్టు చేసి ఫ‌న్నీ కామెంట్ చేశారు.

ఆయ‌న రాసుకొస్తూ కెల్లాగ్స్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు మ‌న భారతీయుల అల్పాహారాన్ని మార్చేస్తామ‌ని చెప్పి ఇప్పుడు 10 ఏండ్ల‌లో వారి ఉత్ప‌త్తులే మారిపోయాయి అంటూ ఫ‌న్నీగా చెప్పారు.ఇంకేముంది ఇలాంటి వైర‌ల్ ట్వీట్‌ను చూస్తూ నెటిజ‌న్లు ఊరుకుంటారా తెగ వైరల్ చేస్తున్నారు.ఇప్ప‌టికీ ఈ ట్వీట్ కు దాదాపుగా 1200 రీట్వీట్‌లు వ‌చ్చాయంటేనే ఇది ఎంత‌లా వైర‌ల్ అవుతుందో తెలుస్తోంది.

మ‌రి ఆనంద్ మ‌హీంద్రా అంటూ మామూలు విష‌య‌మా చెప్పండి.ఇక దీనిపై చాలా ర‌కాల ఫ‌న్నీ కామెంట్లు వ‌స్తున్నాయి.మ‌రి మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube