ఎట్టకేలకు ఆ రైతు విషయంలో సీరియస్ గా స్పందించిన ఆనంద్ మహేంద్ర..!

కర్ణాటకలోని తమకూరు మహీంద్రా SUV షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.ఆ షోరూంలో రైతుకు జరిగిన అవమానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

 Anand Mahendra Finally Responded Seriously About The Farmer  , Farmer's, Suv Sh-TeluguStop.com

బొలెరో వాహనం కొనేందుకు ఓ రైతు, తన స్నేహితులతో కలిసి ఓ రైతు కర్ణాటక లోని మహీంద్రా SUV షోరూంకు వెళ్లగా.కారు కొనే ముఖమేనా నీది.

పక్కకు తప్పుకో.నీలాంటోళ్లను ఇక్కడ చూస్తే వచ్చే కస్టమర్లు కూడా తిరిగెళ్లిపోతారు.

అంటూ సేల్స్ మ్యాన్ ఆ రైతును అవమానించాడు.ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు.

ఆ మాటలకు నొచ్చుకున్న రైతు ఆ ఘటనను అవమానంగా ఫీలయ్యాడు.అప్పటికప్పుడు ఫోన్లు చేసి అర గంటలో 10 లక్షలు పోగుచేసి షోరూం వాడి ముఖాన కొట్టి కొత్త కారును కొనుక్కున్నాడు.

ఈ ఘటనలో ఇరువురి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది.అనంతరం ఆ సేల్స్ మ్యాన్.

రైతుకు క్షమాపణలు చెప్పాడు.అంతటితో కథ ముగియలేదు.

కొత్త కారు బుక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను అవమానించిన కార్ల షోరూమ్ పై కేసు పెట్టాడు.అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.

వివాదానికి ముగింపు పలికారు.ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా తెగ సీరియస్ అయ్యారు.మన ప్రదాన ఉద్దేశం.అందరిని అభివృద్ధి చేయడమే.వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం అన్నారు. తత్వశాస్త్రం ప్రకారం.ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు సత్వరమే పరిష్కారం చూపడం జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, మహీంద్రా సీఈవో విజయ్‌ నక్రా దీనిపై స్పందిస్తూ.మేము సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము.

అందుకు తగిన చర్య తీసుకుంటాం అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube