ఎట్టకేలకు నెల్లూరు అన్నదమ్ములు ఆనం వివేకానంద రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి పసుపు కండువాలు కప్పుకున్నారు.వాస్తవానికి ఈ అన్నదమ్ములు టీడీపీలో చేరడానికి చాలామంది నాయకులు ఒప్పుకోలేదు.
చర్చల మీద చర్చలు జరిగాయి.అనేక కోణాల్లో కసరత్తు చేశారు.
తర్జన భర్జన పడ్డారు.చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో చేరడానికి ఒప్పుకున్నారు.
అనేక షరతులు పెట్టారు.తమ్ముడు రామనారాయణ రెడ్డిని చేర్చుకుంటే ఏమీకాదని, వివేకా వద్దని కొందరు నాయకులు చెప్పారు.
మొత్తం మీద ఇద్దరినీ చేర్చుకున్నారు.విజయవాడలో అన్నదమ్ములు పసుపు కండువాలు కప్పుకున్నారు.
అన్నదమ్ములలో తమ్ముడు రామనారాయణ రెడ్డి తక్కువ మాట్లాడుతాడు.హుందాగా ఉంటాడు.
కానీ వివేకానంద రెడ్డికి నోరు ఎక్కువ.నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాడు.
అభ్యంతరకరమైన భాష కూడా మాట్లాడుతాడు.పసుపు కండువా కప్పుకోగానే వివేకాకు పూనకం వచ్చింది.
వెంటనే వైకాపా నాయకులను రవుడీలు అని తిట్టాడు.వైకాపా నాయకులను తిడితే చంద్రబాబు సంతోషిస్తారని అనుకొని ఉండొచ్చు.
పార్టీలో చేరాక బాబును పొగడాలి కదా.అన్నదమ్ములు ఆ పని బాగానే చేశారు.ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు కొంతకాలం బాగానే ఉంటారు.మరి భవిషత్తులో ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూడాలి.